breaking news
-
విజయం మాదే: ఎమ్మెల్యే అనంత
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. -
34 నామినేషన్ల దాఖలు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. నాల్గో రోజు సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు 34 నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఆరు సెట్ల నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 28 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.వినోద్కుమార్ వద్ద అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకరనారాయణ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, నాయకులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రాజారామ్, పెన్నోబులేసు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా.. రెండో సెట్ను వైఎస్సార్సీపీ నాయకుడు పామిడి వీరాంజినేయులు దాఖలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా జి.లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాలగుండ్ల రవీంద్ర, జాతీయ చేనేత వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా ఉమ్మడిశెట్టి చిన్న వెంకట సుబ్బయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా జి.వి.రమణారెడ్డి, వడ్ల కేశవయ్య నామినేషన్లు దాఖలు చేశారు. -
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. -
బాలికలు.. భళా
● పదో తరగతిలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు ● బాలికలు 85.01, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత ● 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థిని తన్నేరు ప్రణతి ● 76 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. సోమవారం విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 30,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 25,0003 మంది ఉత్తీర్ణత (80.93) శాతం సాధించారు. వీరిలో 15,017 మంది బాలికలను గాను 12,766 మంది 85.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,876 మందికి గాను 12,237 మంది 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో గతేడది 16 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఏకంగా 76 స్కూళ్లు ఈ వందశాతం ఫలితాలు సాధించడం విశేషం. ఉత్తీర్ణులైన వారిలో 18,432 మంది ప్రథమశ్రేణి, 4,100 మంది ద్వితీయ శ్రేణి, 2,471 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టాప్లో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు టాప్లో నిలిచాయి. 273 మంది విద్యార్థులకు గాను 269 మంది 98.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 660 మందికి గాను 638 మంది 96.67 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 11,175 మందికి గాను 10,719 మంది 95.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 237 మందికి గాను 226 మంది 95.36 శాతం, ఏపీ మోడల్ స్కూళ్లల్లో 1,137 మందికి గాను 1027 మంది 90.33 శాతం, కేజీబీవీల్లో 1,252 మందికి గాను 1,053 మంది 84.11 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 190 మందికి గాను 145 మంది 76.32 శాతం, ఎయిడెడ్ స్కూళ్లల్లో 426 మందికి గాను 324 మంది 76.06 శాతం, మునిసిపల్ స్కూళ్లల్లో 2,155 మందికి గాను 1,522 మంది 70.63 శాతం, జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 11,453 మందకి గాను 7,800 మంది 68.10 శాతం, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,935 మందికి గాను1,280 మంది 66.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 24వ స్థానంలో జిల్లా జిల్లాలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు వచ్చినా రాష్ట్రంలో నాలుగుస్థానాలకు కిందకు పడిపోయిది. గతేడాది 66.25 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా ఈసారి 80.93 శాతం అంటే 14.68 శాతం పెరిగింది. 24వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 30లోగా ఫీజు చెల్లింపు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈనెల 30లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టుల పైన రూ. 125, మూడు లోపు సబ్జెక్టులకు రూ. 110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు. రీకౌంటింగ్కు రూ. 500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రం నకలు కావాల్సిన వారు రూ. 1000 ఈనెల 30లోగా సంబంధిత పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. -
పదిలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాదించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాదించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019