breaking news
-
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా..
త్వరలో ముఖేష్ అంబానీ ఫ్యామిలిలో మరో వ్యక్తి చేరనున్నారు. నీతా అంబానీ చిన్న కొడుకు 'అనంత్ అంబానీ' రాధిక మర్చంట్ను వివాహం చేసుకోనున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల సంఖ్య ఓ అడుగు ముందుకు వేయనుంది. అయితే ఈ కథనంలో అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. ఆనంద్ పిరమల్ అజయ్ పిరమల్ & డాక్టర్ స్వాతి పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్ 'పిరమల్ గ్రూప్' బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. శ్లోకా మెహతా రస్సెల్ మెహతా, మోనా మెహతా కుమార్తె శ్లోకా మెహతా రోజీ బ్లూ ఇండియా కంపెనీ బోర్డులో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈమె ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లా & న్యూజెర్సీలోని ఐవీ లీగ్ సంస్థ అయిన ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. రాధిక మర్చంట్ వీరేన్ మర్చంట్ & శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఎన్కోర్ హెల్త్కేర్ డైరెక్టర్ బోర్డులో ఒకరుగా ఉన్నారు. ఈమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. -
ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం గురించి పరిచయం అక్కర్లేదు. దేశంలోనే సంపన్న కుటుంబం కావడంతో ఆ కుటుంబం గురించిన ప్రతి విషయంపైనా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సతీమణి నీతా అంబానీ, కుమారులు, కుమార్తె, అల్లుడు ఇలా ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన అల్లుడు, కుమార్తె ఇషా అంబానీ భర్త అయిన ఆనంద్ పిరమల్కు ముఖేష్ అంబానీ ఇచ్చిన సలహా వెలుగులోకి వచ్చింది. (అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్జెమినీ! కాస్త ఓపిక పట్టండి..) ఆనంద్ పిరమల్ భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అజయ్ పిరమల్ కుమారుడు. తన తండ్రి నిర్మించిన ఫార్మారంగ వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరి నందిని పిరమల్తో కలిసి నడుపుతున్నాడు. ప్రస్తుతం వారి కుటుంబ నికర ఆస్తి విలువ దాదాపు రూ.24 వేల కోట్లు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీకి అల్లుడు. ఇషా అంబానీని వివాహం చేసుకున్నాడు. అయితే ముఖేష్ అంబానీకి ఆనంద్ పిరమల్ ముందు నుంచే తెలుసు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సలహాలను ఆనంద్ తీసుకునేవాడు. (ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) ఆనంద్ పిరమల్, ఇషా అంబానీల వివాహం 2018లో జరిగింది. వారికి కవలలు జన్మించారు. వారి పేర్లు కృష్ణ, ఆదియా. పెళ్లికి ముందే వీరి కుటుంబాలు ఒకరికొకరు తెలుసు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరియర్కు సంబంధించి ముఖేష్ అంబానీ తనకు ఏం సలహా ఇచ్చారో ఆనంద్ పిరమల్ బయటపెట్టాడు. క్రికెట్ను ముడిపెడుతూ అంబానీ ఇచ్చిన సలహా ఆసక్తికరంగా ఉంది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) తాను కన్సల్టింగ్ లేదా బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఆనంద్ ఒకసారి అంబానీకి చెప్పాడు. దానిపై అతని సలహా కోరాడు. దీనికి అంబానీ క్రికెట్ను ముడిపెడుతూ చక్కని సలహా ఇచ్చాడు. కన్సల్టెంట్గా ఉండటం అనేది క్రికెట్ చూడటం లేదా క్రికెట్ గురించి వ్యాఖ్యానించడం లాంటిదని, అదే పారిశ్రామికవేత్త కావడం అనేది క్రికెట్ ఆడటం లాంటిదని అంబానీ తనకు సలహా ఇచ్చారని పిరమల్ చెప్పారు. ఇది తనకు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పాల్సిందని, 25 ఏళ్ల వయసులో కాదని తాను అంబానీతో చమత్కరించిన్లు పేర్కొన్నారు. ఎవరీ ఆనంద్ పిరమల్? పిరమిల్ గ్రూప్ ఆర్థిక సేవలకు ఆనంద్ పిరమల్ నాయకత్వం వహిస్తున్నారు. అతని కంపెనీ గృహ రుణాలు, ఎస్ఎంఈ లోన్లు, నిర్మాణ ఫైనాన్స్ మొదలైనవాటిని అందిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ విభాగానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. పిరమల్ ఈ-స్వస్థ్య అనే ఆనంద్ స్థాపించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే ఈ కంపెనీలో దాదాపు 2300 మంది ఉద్యోగులు, 140 మంది వైద్యులు ఉన్నారు. ఆనంద్ పిరమల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 100 ఏళ్ల ఇండియన్ మర్చంట్ ఛాంబర్స్ యువజన విభాగానికి ఆనంద్ అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు. (ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?) -
తాతైన ముఖేష్ అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాతయ్యారు. అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్..నవంబర్ 19న కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ..ఈ మేరకు అంబానీ, పిరమల్ కుటుంబాలు అధికారికంగా ప్రకటనను విడుదల చేశాయి. ఇషాకు పుట్టిన కవల పిల్లలో..ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఆదియా అని పేరు పెట్టగా, బాబుకు కృష్ణ అని పేర్లు పెట్టినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ,నీతూ అంబానీల కుమార్తె ఇషా అంబానీ..పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ల వివాహం 2018 డిసెంబర్లో జరిగింది. ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా ఆమె భర్త ఆనంద్ పిరమల్.. పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
అలాంటి వాళ్లంటే నాకు నచ్చదు: ఇషా అంబానీ
ముంబై: వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీకి, పిరమాల్ సంస్థకు వారసుడైన ఆనంద్ పిరమాల్కు అంగరంగ వైభవంగా వివాహమైన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ ఈ మధ్య వోగ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చారు. తన భర్తకు ఆనంద్ పిరమాల్కు మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉందని, తనను బాగా నవ్విస్తారని చెప్పుకొచ్చారు. ఆహారం వృథా చేసేవారు తనకు నచ్చరని తెలిపారు. తాను సంప్రదాయ దుస్తుల్నే(కాటన్ సల్వార్ కమీజ్స్) ధరిస్తానని తెలిపారు. తాను ఎక్కువగా ఎవరితోనూ కలవలేనని, బాగా ఆలోచించి జడ్జ్ చేస్తానని చెప్పుకొచ్చారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019