breaking news
Ad - Sakshi_Home_Sticky
-
బాబు అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకుని మాయమాటలు చెబుతున్నాడని, ఆయన అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ చెప్పారు. చంద్రబాబు తీరును తప్పుబడుతూ మునీర్ అహ్మద్ మంగళవారం సాక్షితో మాట్లాడారు. సొంత అవసరం, అవకాశాన్ని బట్టి పార్టీలతో పొత్తులు పెట్టుకునే చంద్రబాబు ముస్లిం మైనార్టీలను మాయమాటలతో మోసం చేస్తూ వచ్చారన్నారు. ప్రతిసారి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం, ఇంకెప్పుడూ మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోనని నమ్మబలకడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని సిగ్గులేకుండా జనం ముందుకు వస్తున్నాడన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం నైతిక విలువలు లేని స్వార్థ రాజకీయ చరిత్రేనని చెప్పారు. ఈ అనైతిక పొత్తును ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం కావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు తొలినుంచి ముస్లిం ఓట్లు రాబట్టుకుని వారిని ధోకా (మోసం) చేయడం అలవాటుగా మారిందన్నారు. బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు వివక్షపూరిత స్వభావం కలిగిన సీఏఏ బిల్లుకు మద్దతు తెలపడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. మైనారిటీలకు పదవులు ఇవ్వలేదని ప్రశ్నించిన ముస్లిం సోదరులపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టించిన దురాగతాలను ముస్లిం సమాజం మరచిపోలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల కోసం రూ.3,495 కోట్లు కేటాయిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.23 వేల కోట్లు ముస్లిం సంక్షేమానికి ఖర్చు చేసిందని చెప్పారు. ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లను కొనసాగిస్తున్న సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్న బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను దగాచేయడానికి జట్టుకట్టారని మండిపడ్డారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్తోపాటు అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన సీఎం జగన్ ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించి అండగా నిలిచారని గుర్తుచేశారు. ముస్లింలలో వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు కొందర్ని చుట్టూ పెట్టుకుని మళ్లీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజం చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మేస్థితిలో లేదని, సీఎం జగన్కే ముస్లింల మద్దతు దక్కుతుందని మునీర్ అహ్మద్ స్పష్టం చేశారు. -
పల్లవి పటేల్తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సీఎం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి. తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీకి చెందిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. -
మా స్థానాలు, అభ్యర్థుల మార్పులుండవు
సాక్షి, అమరావతి: పొత్తులో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు విషయంలో గానీ, ఆయా స్థానాలకు ఇప్పటికే పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోగానీ ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీట్లు మార్పు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించిన నరసాపురం లోక్సభ, అనపర్తి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సోషల్ మీడియాతో పాటు వారి అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిపై సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఊసరవెల్లి.. షర్మిలను సీఎం జగన్పై ప్రయోగించిన కుటిలనేత
అధికారంకోసం అడ్డదారులు తొక్కడం... అవసరమైతే అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనుకాడకపోవడం... రోజుకో ఎత్తు గడతో నాలుక మడతేసేయడం... బద్ధ శత్రువులతోనైనా ఇట్టే జతకట్టేయడం... మరో అడుగు ముందుకేసి ఏకంగా కుటుంబాల్ని చీల్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి వ్యక్తులనైనా బోల్తాకొట్టించగల సమర్థుడాయన. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలను ఏకం చేసేందుకు నానా పాట్లు పడ్డారు. అంతేనా...మరో అడుగు ముందుకేసి ఆయన సోదరినే పావుగా వాడుకున్నాడు. అదీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా అన్నా... చెల్లెళ్లిద్దరూ కలసి నాటక మాడుతున్నారంటూ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారంకోసం ఎంతకైనా తెగించగలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న తీరును జనం సైతం ఛీకొడుతున్నారు. సాక్షి, అమరావతి: రాజకీయంలో ఎలాంటి కుట్రలకైనా వెరవకూడదనీ.. అబద్ధాలు అలవోకగా ఆడేయొచ్చని.. ఎలాంటి విషయాన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవచ్చని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కొనేందుకు అన్ని అ్రస్తాలను ఎక్కుపెట్టారు. ఘోర పరాజయం నుంచి తప్పించుకుని, రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి చివరి ప్రయత్నంగా మహానేత వైఎస్ కుటుంబాన్ని చీల్చి.. సీఎం జగన్పై సోదరి షర్మిలను ప్రయోగించారు. సోదరికే న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం చేయగలరని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన చంద్రబాబే.. ఆమెకు జనస్పందన లభించకపోవడం, తాను అనుకున్న ప్రయోజనాలు లభించే అవకాశాలు కన్పించకపోవడంతో మరోసారి మాట మార్చారు. శనివారం పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని.. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ఇప్పుడు కొత్తగా ప్రశ్నించారు. అంతేగాదు... పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోందంటూ ఆరోపించారు. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని మరో ప్రచారానికి దిగారు. దీనిని బట్టి ఆయన రంగులు మార్చడంలో ఊసరవెల్లికి కూడా మించిపోతారని రాజకీయ విశ్లేషకులు వ్యంగోక్తులు విసురుతున్నారు. పావులా మారిన షర్మిల తెలంగాణలో 2021 జూలై 8న వైఎస్సార్సీపీని షర్మిల స్థాపించారు. తన బతుకైనా చావైనా తెలంగాణలోనేని ఆమె అప్పట్లో ప్రతిజæ్ఞ చేశారు. కానీ.. గతేడాది చివర్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్రసన్యాసం చేసి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్తో బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా మంతనాలు జరిపి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు కట్టబెట్టేందుకు ప్రణాళిక రచించారు. బీజేపీలోని తన ఏజెంట్, ప్రస్తుతం అనకాపల్లి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్కు ఇం‘ధనం’ చేకూర్చి.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ద్వారా కథ మొత్తం నడిపించారు. షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు.. పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నాక ఢిల్లీ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలోనే ప్రయాణించారు.ఇప్పటికీ సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో షర్మిల ప్రయాణాలు చేస్తుంటే.. ఆమె భర్త అనిల్ టీడీపీ నేతలు బీటెక్ రవి, దేవగుడి నారాయణరెడ్డి తదితరులతో సమావేశమవుతున్నారు. షర్మిలను సీఎం జగన్పై ఉసిగొలిపి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆ ప్రయోగం విఫలమై ఇప్పుడు కొత్త పాచిక చంద్రబాబు, ఎల్లో పత్రికలు సీఎం జగన్పై చిమ్ముతున్న విషాన్నే పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల చేత వల్లెవేయించారు. మరో అడుగు ముందుకేసి కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచేలా చక్రం తిప్పారు. షర్మిలకు తోడుగా వివేకా కూతరు సునీతను రంగంలోకి దించారు. వారిద్దరి ద్వారా వివేకా హత్యపై దుష్ప్రచారం చేయించి.. దాన్ని అస్త్రంగా మార్చుకుని లబ్ధి పొందాలన్నది చంద్రబాబు పాచిక. కానీ.. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలే ఆయన హత్యకు దారితీశాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నందున కడప లోక్సభ స్థానం పరిధిలో షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు ప్రజాస్పందన కన్పించలేదు. తాను అనుకున్న ప్రయోజనం లభించకపోవడంతో చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. ఇప్పుడు షర్మిలపైనా నిందలు మొదలుపెట్టేశారు. వారిద్దరూ కలసి ఎనీ్టయే ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకుని తన సహజ నైజాన్ని చాటుకుంటున్నారు. అధికారంకోసం జిత్తులమారి ఎత్తులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయమని దాదాపు అన్ని సర్వేల్లోనూ స్పష్టమైంది. అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేని చంద్రబాబు జనసేన, బీజేపీతో జతకలిశారు. మరో వైపు వివేకానందరెడ్డి కూతురు సునీతను చేరదీశారు. వివేకా హత్యపై సునీతతో దుష్ప్రచారం చేయిస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. అంతేగాకుండా జగన్ సోదరి షర్మిలను వాడుకునేందుకు కొత్త ప్రణాళికను అమలు పర్చారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019