breaking news
-
పునరుత్పాదక విద్యుత్లో అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు
న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. గుజరాత్లోని ఖావ్డా సోలార్ పార్క్లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. -
మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్ ఫోటో వైరల్
అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితండ్రులకు ఎక్కువప్రేమ అభిమానం ఉంటుంది అని. చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా బిలియనీర్, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. 14 నెలల మనవరాలు కావేరిని ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్టాపిక్గా నిలిచింది. "ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. కాగా లండన్లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు పని ఒత్తిడి (బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీవర్స్) పెద్ద ఉపశమనం అని గతంలో పేర్కొన్నారు. "నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే నాకు గొప్ప శక్తి’’ గౌతమ్ అదానీ. इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR — Gautam Adani (@gautam_adani) April 2, 2024 -
మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ
-
అదానీ గ్రూప్ ప్రపంచ అతిపెద్ద కాపర్ ప్లాంట్
గుజరాత్లోని ముంద్రాలో అదానీ గ్రూప్ భారీ కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే సింగిల్ లొకేషన్లో ఏర్పాటైన అతి పెద్ద కాపర్ తయారీ కర్మాగారంగా నిలవనుంది. దీనితో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గనుంది. అంబుజాలో అదానీ వాటా అప్ రూ. 6,661 కోట్ల పెట్టుబడులు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా అంబుజా సిమెంట్స్లో వాటాను పెంచుకుంది. 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకోవడం ద్వారా 3.6 శాతం అదనపు వాటాను పొందింది. ఇందుకు రూ. 6,661 కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం అంబుజాలో అదానీ వాటా 66.7 శాతానికి చేరింది. దేశీయంగా సిమెంట్ తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న అంబుజాలో ప్రమోటర్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకి రూ. 314.15 సగటు ధరలో వారంట్లను మార్పిడి చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్లోనూ ప్రమోటర్ సంస్థ వారంట్లను అందుకోవడం ద్వారా రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా హార్మోనియాకు 47.74 కోట్ల మార్పిడికి వీలయ్యే వారంట్లను అంబుజా సిమెంట్స్ జారీ చేసింది. -
అదానీ చేతికి గోపాల్పూర్ పోర్టు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఖాతాలోకి మరో పోర్టు వచ్చి చేరనుంది. గ్రూప్లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ (ఏపీసెజ్) తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును (జీపీఎల్) దక్కించుకోనుంది. ఇందుకోసం జీపీఎల్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్, ఒడిశా స్టీవ్డోర్స్ లిమిటెడ్ (ఓఎస్ఎల్) నుంచి 95 శాతం వాటాలను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేయనుంది. జీపీఎల్లో ఎస్పీ పోర్ట్ మెయింటెనెన్స్కి 56 శాతం, ఓఎస్ఎల్కి 44 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో ఎస్పీ గ్రూప్ వాటాలను పూర్తిగా, ఓఎస్ఎల్ నుంచి 39 శాతం వాటాలను ఏపీసెజ్ కొనుగోలు చేయనుంది. ఓఎస్ఎల్ 5 శాతం వాటాతో జాయింట్ వెంచర్ భాగస్వామిగా కొనసాగనుంది. రూ. 3,080 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో 95 శాతం వాటాను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీసెజ్ తెలిపింది. నిర్దిష్ట మైలురాళ్లను అధిగమించాకా 5.5 ఏళ్ల తర్వాత మరో రూ. 270 కోట్లు చెల్లించే ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఎంటర్ప్రైజ్ విలువను రూ. 3,350 కోట్లుగా లెక్కగట్టినట్లవుతుంది. గోపాల్పూర్ పోర్టు కొనుగోలుతో తమ కస్టమర్లకు మరింతగా సమగ్రమైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఏపీసెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దీనితో ఒడిశాలోని మైనింగ్ హబ్లు, పొరుగు రాష్ట్రాలు అందుబాటులోకి రాగలవని, తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తమ లాజిస్టిక్స్ సేవలను విస్తరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఏపీసెజ్కి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల్లో పద్నాలుగు పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం.. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో గోపాల్పూర్ పోర్టు పని చేస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినా మొదలైన కార్గోను హ్యాండిల్ చేస్తోంది. ఇటీవలే ఇది ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెరి్మనల్ను నెలకొల్పేందుకు పెట్రోనెట్ ఎల్ఎన్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీపీఎల్ 11.3 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ. 520 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనాలు ఉన్నాయి. అసెట్ మానిటైజేషన్పై ఎస్పీ దృష్టి.. రూ. 20,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ఎస్పీ గ్రూప్ గత కొన్నాళ్లుగా అసెట్ మానిటైజేషన్ (ఆస్తులను విక్రయించడం లేదా, లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం)పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో మహారాష్ట్రలోని ధరమ్తార్ పోర్టును రూ. 710 కోట్ల విలువకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి విక్రయించింది. 2015లో దీన్ని కొనుగోలు చేసిన ఎస్పీ గ్రూప్.. ఆ తర్వాత కార్యకలాపాలను టర్న్అరౌండ్ చేయగలిగింది. వార్షిక సామర్థ్యాన్ని 1 ఎంటీపీఏ నుంచి 5 ఎంటీపీఏకి పెంచింది. ఇక గోపాల్పూర్ పోర్టు ఒప్పందం గత కొద్ది నెలల్లో రెండో డీల్. రెండు పోర్టులను గణనీయమైన విలువకు విక్రయించడమనేది అసెట్స్ను టర్న్అరౌండ్ చేయడంలోను, స్వల్పకాలంలోనే వాటాదారులకు మెరుగైన రాబడులు అందించడంలోనూ తమకు గల సామర్థ్యానికి నిదర్శనమని ఎస్పీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019