breaking news
-
భారత అంతర్గత వ్యవహరాలపై స్పందించిన యూఎన్ఓ
న్యూయార్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం వంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)స్పందించింది. అయితే ఇటీవల ఈ విషయాలపై అమెరికా స్పందించగా.. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు కూడా జరీ చేసింది. ఒక్కరోజు వ్యవధిలో ఐక్యరాజ్య సమితి స్పందించటం గమనార్హం. భారత్లో లోక్సభ ఎన్నికల ముందు విపక్ష సీఎం అరెస్ట్, ప్రతిపక్షపార్టీ ఖాతాల స్తంభనతో నెలకొన్న రాజకీయ అనిశ్చిత్తిపై ఓ విలేకరి ప్రస్తావించగా.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు. ‘ఇండియా, ఎన్నికలు జరిగే ప్రతి దేశంలోను ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లపై అమెరికా రెండోసారి స్పందించటం గమనార్హం. అయితే దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి పూర్తిగా తమ దేశ అంతర్గత విషయాన్ని స్పష్టం చేసింది. ఆయా తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. -
28న వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కింద 2023–24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు సాయమందిస్తారు. రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.67,500 ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీకంటే రూ.17,500 ఎక్కువగా ప్రతి రైతుకూ సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం రూ.13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022– 23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్లు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. 2023–24లో గరిష్టంగా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు. లబ్ధిదారుల్లో 51,00,063 మంది భూ యజమానులు కాగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సాగుదారులు 1,64,705 మంది, దేవదాయ, అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది 53.58 లక్షల మందికి రూ.7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సీజన్లో రూ.లక్ష లోపు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 73.88 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన ఐదేళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్లు కూడా ఉన్నాయి. తాజాగా రబీ –2021–22 సీజన్లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు రూ.84.30 కోట్లు, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి రూ.131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షలమందికి రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా, వడ్డీ రాయితీ సొమ్ము మూడు రెట్లు ఎక్కువగా అందించినట్టయింది. ఇచ్చిన మాట కంటే ఎక్కువగా ఇస్తున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.65,500 చొప్పున సాయం అందించగా, మిగిలిన సాయం ఈ నెల 28న జమ చేస్తున్నాం. తాజా సాయంతో కలిపి ఈ 5 ఏళ్లలో 34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టయ్యింది. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల కింద చంద్రబాబు రైతులకు ఇచ్చిన సాయంకంటే రెట్టింపు సాయం ఒక్క రైతు భరోసా పథకం కిందే ఇచ్చాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
ఆ అప్పులు.. అంటగట్టినవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్’ నివేదిక కుండబద్ధలు కొట్టింది. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయంటూ ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నివేదిక స్పష్టం చేసింది. 2022–23 అకౌంట్స్పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించింది. కార్పొరేషన్ల అప్పులను దాచేస్తున్నారని, కాగ్కు కూడా చెప్పడం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడించింది. 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, మార్కెట్ రుణాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్థిక సంస్ధల నుంచి గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పుల పూర్తి వివరాలను కాగ్ స్పష్టంగా వెల్లడించింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలు, లక్ష్యాలను ప్రభుత్వం పక్కాగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు, ద్రవ్య, రెవెన్యూ లోటు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ బయట అప్పులను సైతం ఎటువంటి దాపరికం లేకుండా కాగ్ అకౌంట్స్లో స్పష్టం చేసింది. 2018–19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది (2019 మే నాటికి టీడీపీ సర్కారు సొంత ప్రచారం కోసం మరో రూ.14 వేల కోట్లు అప్పు చేసింది). ఆ రూ.14 వేల అప్పులను మినహాయించి చూసినా సరే 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు రూ.4,23,942 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,66,330 కోట్లు మాత్రమేనని, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2022–23 నాటికి బడ్జెట్లో అప్పులతో పాటు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీల ద్వారా గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు మొత్తం కలిపి రూ.5,62,817 కోట్లు మాత్రమేనని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించినా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అనధికార అప్పులంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) నిర్వహణలో భాగంగా ఇన్సాల్వెన్సీ– దివాలా కోడ్ కింద దాఖలైన టాప్ 20 ఖాతాలను నెలవారీగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులను కోరింది. పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలతో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మాట్లాడుతూ, నెలవారీగా టాప్ 20 దివాలా కేసులను సమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పని తీరును కూడా సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెజారిటీ వాటాతో ఎన్ఏఆర్సీఎల్ 2021లో ఏర్పాటయి న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. కెనరా బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్గా ఉంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019