breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Lok sabha elections 2024: దుమ్ము రేపుతున్న సోషల్ మీడియా
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో పారీ్టలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. ప్రజల మూడ్తో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ‘లైక్ చేయండి.. షేర్ చేయండి.. సబ్ర్స్కయిబ్ చేసుకోండి’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎడాపెడా యాడ్లు కుమ్మరిస్తూ డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పలు పారీ్టలు లోక్సభ ఎన్నికల సీజన్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి..! పదేళ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీయే సోషల్ మీడియాలోనూ రాజ్యమేలుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నాయి. ప్రస్తుత లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్కు పెద్దగా సోషల్ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. నేతల విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులెవరకీ అందనంత ఎత్తులో మూడు లైక్లు.. ఆరు షేర్లు అన్నట్టుగా ‘సోషల్’ జర్నీలో దూసుకుపోతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పార్టీలు, నేతల సోషల్ మీడియా పేజీలు/ఖాతాల్లో యూజర్ల సంఖ్య పెరుగుదల, డిజిటల్ యాడ్ వ్యయాలు తదితరాలను ‘సోషల్ బ్లేడ్’ అనే ఎనలిటిక్స్ సంస్థ విశ్లేషించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ‘ఎక్స్’ ఫ్యాక్టర్! సోషల్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తోంది. బీజేపీ ఎక్స్ ఖాతాకు గత మూడు నెల్లలో 4 లక్షల పైచిలుకు యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37 లక్షల కొత్త ఫాలోవర్లను సాధించింది. ఆప్కు 12,000 మంది నయా యూజర్లు దక్కారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వారి సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్కు కీలక వేదికగా నిలుస్తున్న ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18 కోట్ల ఫాలోవర్లున్నారు! కాంగ్రెస్ను 1.04 కోట్లు, ఆప్ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు. టీఎంసీ మాత్రం 6.9 లక్షలతో వెనకబడి ఉంది. యూట్యూబ్లో ‘ఆప్’ షో పారీ్టల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలకు కీలక వేదికగా నిలుస్తున్న యూట్యూబ్లో ఆప్ ‘చీపురు’ తిరగేస్తోంది. కొత్త సబ్్రస్కయిబర్లను పెంచుకోవడంలో ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా ముందుండగా బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టారు. గత మూడు నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ చానల్ను ఏకంగా 3.6 లక్షల మంది సబ్ర్స్కయిబ్ చేసుకున్నారు! బీజేపీ మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జతయినా ఫిబ్రవరి, మార్చిల్లో భారీగా తగ్గారు. మొత్తమ్మీద 3 నెలల్లో బీజేపీ చానల్కు 5.3 లక్షలు, కాంగ్రెస్క 5 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. టీఎంసీ 28,000 మంది యూజర్లను సంపాదించింది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. జనవరి–మార్చి మధ్య ఏకంగా 43.2 కోట్ల వీక్షణలు దక్కాయి. తర్వాతి స్థానంలో ఆప్ (30.78 కోట్లు), కాంగ్రెస్ (16.69 కోట్లు), టీఎంసీ (93 లక్షలు) ఉన్నాయి. 59.9 లక్షల సబ్స్క్రయిబర్లు, 10 వేలకు పైగా వీడియోలతో యూట్యూబ్ను ఆప్ ఊడ్చేస్తోంది. బీజేపీ యూట్యూబ్ చానల్ 58.2 లక్షల సబ్ర్స్కయిబర్లు, 41 వేల వీడియోలతో ‘టాప్’ లేపుతోంది. కాంగ్రెస్కు 44.8 లక్షలు, తృణమూల్ను 5.91 లక్షల మంది సబ్్రస్కయిబ్ చేసుకున్నారు. ఎదురులేని మోదీ... సోషల్ మీడియా వేదికేదైనా దేశంలోనే గాక ప్రపంచంలోనే తిరుగులేని నాయకునిగా మోదీ దుమ్మురేపుతున్నారు. భారత్లో ఏ నాయకుడూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు! గత మూడు నెలల్లో మోదీ ‘ఎక్స్’ యూజర్ల సంఖ్య 26 లక్షలు పెరిగి 9.73 కోట్లకు చేరింది. కేజ్రీవాల్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్ష పెరిగి 2.74 కోట్లుగా ఉంది. రాహుల్గాం«దీకి కొత్తగా 5 లక్షల మంది జతయ్యారు. ఆయన యూజర్ల సంఖ్య 2.54 కోట్లకు పెరిగింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా 52,000 మంది యూజర్లు దక్కారు. ఎక్స్లో ఆమెను 74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఎక్స్లో అత్యంత యాక్టివ్గా ఉండే రాజకీయవేత్తగా కూడా మోదీ నిలుస్తున్నారు. గత మూడు నెలల్లో మోదీ 1,367 పోస్టులు పబ్లిష్ చేశారు. కేజ్రీవాల్ 270, రాహుల్ 187 పోస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇన్స్టాలోనూ మోదీకి ఏకంగా 8.85 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అందులో గత మూణ్నెల్లలోనే 52 లక్షల మంది మోదీని కొత్తగా ఫాలో కావడం జెన్ జెడ్లోనూ ఆయన క్రేజ్కు అద్దం పడుతోంది. ఇన్స్టాలో రాహుల్కు 68 లక్షలు, కేజ్రీవాల్కు 22 లక్షలు, మమతాకు కేవలం 3.84 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు! ఇక యూట్యూబ్లోనూ మోదీదే హవా! 2.29 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఆయన సొంతం. రాహుల్ (44.7 లక్షలు), కేజ్రీవాల్ (7.58 లక్షలు) మోదీకి ఆమడ దూరంలో ఉన్నారు. గత మూడు నెలల్లో మోదీ చానల్లో పబ్లిషైన వీడియోలకు అత్యధికంగా 47.7 కోట్ల వ్యూస్ దక్కాయి! ఇది రాహుల్, కేజ్రీవాల్ వీడియోల కంటే రెట్టింపు కావడం విశేషం. ఇన్స్టా.. జెన్–జెడ్ ఓటర్ల ‘డెన్’ ఇన్స్టాగ్రామ్లో రీల్స్.. స్టోరీస్.. పోస్ట్లు.. లైవ్ వీడియోలతో చెలరేగిపోతున్న నవతరం యువత (జెనరేషన్ జెడ్)కు చేరువయ్యేందుకు పారీ్టలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఓటేయనున్న యూత్కు అడ్డగా మారిన ఈ సోషల్ వేదికపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం మెటా ఫ్లాట్ఫాంలైన ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ల్లో బీజేపీ, కాంగ్రెస్ గత నాలుగు నెలల్లో చేసిన యాడ్ వ్యయాల్లో సింహ భాగం ఇన్స్టాపైనే వెచి్చంచడం దీని ప్రాధాన్యానికి నిదర్శనం. గత మూడు నెలల్లో ఈ ప్లాట్ఫాంలో కాంగ్రెస్ 13.2 లక్షల మంది ఫాలోవర్లను పెంచుకోగా బీజేపీ (8.5 లక్షలు), ఆప్ (2.3 లక్షల)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎంసీకి 6,000 మంది కొత్త యూజర్లు దక్కారు. మొత్తం ఫాలోవర్ల విషయానికొస్తే, బీజేపీకి 76 లక్షలు, కాంగ్రెస్కు 43 లక్షలు, ఆప్కు 12 లక్షలు, తృణమూల్కు కేవలం 1.1 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం కేజ్రీవాల్ను జైల్లో చంపేందుకు కుట్ర: ఈడీ ఆరోపణలపై ఆప్ కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు వంటి తియ్యటి పదార్ధాలు తింటున్నారంటూ ఈడీ చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఈడీ తప్పులు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది.. సీఎం కేజ్రీవాల్ను జైల్లో చంపడానికి కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అని.. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఇన్సులిన్ ఇవ్వడం లేదని విమర్శించారు. ‘సీఎం కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్తుడని అందరికీ తెలుసు.. అతను గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తన షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటాడు. ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్నవారు మాత్రమే ఇంత ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. అందుకే కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి అనుమతించింది. కానీ బీజేపీ తన జేబు సంస్ధ ఈడీ సాయంతో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఆయనకు ఇంటి నుంచి ఆహారం అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ స్వీట్ టీ తాగుతున్నారని, స్వీట్లు తింటున్నారని ఈడీ చెప్పడం పూర్తి అబద్ధం.. కేజ్రీవాల్జీకి డాక్టర్ సూచించిన స్వీటెనర్తో టీ,స్వీట్లకు అనుమతి ఉంది. ఇది డయాబెటిక్ రోగులకు ఇవ్వబడే తక్కువ కేలరీల స్వీటెనర్. కేజ్రీవాల్ తన బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుకోవడానికి అరటిపండ్లు తింటున్నాడన్న ఈడీ ఆరోపణలు అతిషి తప్పుబట్టారు. ‘నేను ఈడీకి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మధుమేహ వైద్యుడితో మాట్లాడండి. రోగులకు అరటిపండు, కొన్ని రకాల టోఫీ లేదా చాక్లెట్ ఎల్లప్పుడూ వారితో ఉంచుకోమని చెబుతారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు లేదా జైలులో ఉన్నప్పుడు అతను ఎప్పుడూ ఏదో ఒక రకమైన టోఫీ, అరటిపండు అతనితో కలిగి ఉండాలని కోర్టు ఉత్తర్వులో స్పష్టంగా రాసి ఉంది’ అని తెలిపారు. చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. దిల్లీ సీఎం అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్కు ఇంటి భోజనానికి అనుమతి ఉండటంతో ఆయన నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది. టైప్-2 డయాబెటీస్తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారని తెలిపింది. ఇలాంటివి తింటే షుగర్లెవల్స్ పెరుగుతాయని ఆయనకు తెలిసే.. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ను వైద్యులు చెక్ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ ఛార్ట్పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహాడ్ జైలు అధికారులను ఆదేశించింది. అనంతరం పిటీషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
Delhi Liquor Scam: సంక్షోభం వేళ ఎంపీల మౌనం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ అరెస్ట్తో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ పార్టీ ఎంపీలు మాత్రం మౌనవ్రతం పాటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పారీ్టకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం ఇద్దరే కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా వారి వ్యవహారంపై పార్టీ సమావేశంలో చర్చించాలనే డిమాండ్లు అంతర్గతంగా ఊపందుకున్నాయి. ఎనిమిది మంది గాయబ్.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ గత నెల 21న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ ఢిల్లీసహా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ఇద్దరు ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్సింగ్, సందీప్ పాఠక్లు మాత్రమే చురుగ్గా ఉంటున్నారు. మిగతా 8 మంది సభ్యులు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. సంజయ్ సింగ్ ఈ కేసులో బెయిల్పై బయటకు వచి్చన మరునాటి నుంచే బీజేపీని, దర్యాప్తు సంస్థల పనితీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. సందీప్ పాఠక్ సైతం సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ఆప్ గొంతుక వినిపిస్తున్నారు. పార్టీ కోశాధికారి, ఎంపీ ఎన్డీ గుప్తా అడపాదడపా మాత్రమే నిరసనల కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. పూర్తి స్థాయి కార్యక్రమాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. మీడియా భేటీల్లో, సభల్లో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్న ఎంపీ రాఘవ్ చద్దా ఆచూకీ కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆయన ఢిల్లీలో లేరు. గత నెల మొదటి వారంలో లండన్ వెళ్లి కంటికి చికిత్స చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఆయన ఢిల్లీ రావాల్సి ఉన్నా, వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండిపోయారంటున్నారు. మరో కీలక నేత స్వాతి మలివాల్ సైతం అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కేజ్రీవాల్ అరెస్ట్ను సామాజిక వేదికలపై ఖండిస్తున్నారు. ప్రత్యక్ష నిరసల్లో ఇంతవరకూ పాల్గొనలేదు. తన సోదరి అనారోగ్యం దృష్ట్యా అమెరికాలో ఉండాల్సి వస్తోందని, తిరిగి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడుతానని అంటున్నారు. పంజాబ్కు చెందిన పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీతతో భేటీ అయ్యారు. అది మినహా రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీ, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లోగానీ పాల్గొనలేదు. మరో ఇద్దరు ఎంపీలు అశోక్కుమార్ మిట్టల్, క్రికెటర్ హర్బజన్సింగ్లు కేజ్రీ అరెస్ట్ మినహా ఇతర అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పర్యావరణ వేత అయిన ఎంపీ బల్బీర్సింగ్ సీచేవాల్, మరో ఎంపీ విక్రమ్జీత్ సింగ్ చాహ్నీలు సైతం తమ వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇలా..పార్టీ ఎంపీలు మౌనవత్రం దాల్చడంపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో జరిగే కీలక భేటీలో ఎంపీల తీరుపైచర్చిస్తామని సంజయ్ సింగ్ చెప్పారు. -
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!.. మంత్రి సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ నేతలు ప్రతీరోజు కేంద్రంలోని బీజేపీ, దర్యాప్తు సంస్థలతో తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆప్ మంత్రి అతిశి సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి అతిశి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. గతంలోని అనుభవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం మానేశారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్)ని పదవి నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Let me warn the BJP that imposing President's rule in Delhi will be illegal, unconstitutional and against the mandate of the people of Delhi. The people of Delhi have given a clear mandate to Arvind Kejriwal and Aam Aadmi Party." pic.twitter.com/IbcVTnpkNK — ANI (@ANI) April 12, 2024 దీంతో, మంత్రి అతిశి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రతిరోజు కొన్ని అందమైన కథల్ని వండి వార్చుతున్నారని కాషాయ పార్టీ నేతలు ఎద్దేవా చేసింది. ఇక, ఆప్ సర్కార్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా.. సీఎం పీఎస్ వైభవ్ కుమార్ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ప్రకటించింది. కాగా, ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Arvind Kejriwal has been arrested in a fake case and that too without any proof because there is a conspiracy to topple the elected govt of Delhi. when we see a few things from the past, it shows that there has been a… pic.twitter.com/kcGcqRIpde — ANI (@ANI) April 12, 2024 -
కేజ్రీవాల్ సతీమణిపై ‘ఆప్’ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఒక గ్లూ(జిగురు) అని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీలకుండా కలిపి ఉంచుతున్నారని కొనియాడారు. ‘సునీతా కేజ్రీవాల్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటే పార్టీని ఆమె జిగురులాగా కలిపి ఉంచుతారు. ఆప్ను ఇక ఎవరూ ఏం చేయలేరు. ఆమె కుటుంబ సభ్యురాలు కావడం వల్ల సీఎం కేజ్రీవాల్ను ఆమె జైలులో రోజు కలిసే చాన్స్ ఉంది. దీంతో ఢిల్లీ సమస్యలను ఆమె కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్ ఆదేశాలను పార్టీ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఆప్ కార్యకర్తలకు అరవింద్ కేజ్రీవాల్తో ఉన్న బంధం వల్ల వారంతా సునీతా కేజ్రీవాల్ పట్ల సానుభూతితో పనిచేస్తున్నారు’అని భరద్వాజ్ అన్నారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మార్చ్22న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇండియా కూటమి ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు. ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇదీ చదవండి.. ఎన్ఏఐ బృందంపై దాడిని సమర్థించిన ‘దీదీ’
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019