breaking news
-
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
ప్రేమ అనేది వ్యసనం.. అందుకే ఇలా అంటూ స్టార్ హీరో
‘12th ఫెయిల్’ సినిమాతో నటుడు విక్రాంత్ మాస్సే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యారు. నటి శీతల్ ఠాకూర్తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వారికి మొదటి బిడ్డ జన్మించింది. బాబుకు వర్దాన్ అని పేరు పెట్టారు. కుమారుడిపై ప్రేమతో విక్రాంత్ మాస్సే తన కుమారుడి పేరును 'వర్దాన్' చేతిపై తాజాగా టాటూగా వేపించాడు. ఆ చిత్రాన్ని తన అభిమానులకు పంచుకున్నాడు. ఫిబ్రవరి 7న వారికి వర్దన్ పుట్టినప్పటి నుంచి ఈ జంట మరింతి ఉత్సాహంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన టాటూతో పాటు తన కుమారుడిపై ప్రేమను పంచుకున్నాడు. ఇక నుంచి భార్యత పాటు కుమారుడికి కూడా తన ప్రేమను పంచాలని తెలిపాడు. ప్రేమ అనేది వ్యసనం లాంటిదని చెప్పుకొచ్చాడు. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. ‘12th ఫెయిల్’ చిత్రం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట, మొదట ఫిబ్రవరి 14, 2022న వివాహం చేసుకున్నారు. తరువాత, ఫిబ్రవరి 18, 2022 న శీతల్ ఠాకూర్కు చెందిన హిమాచల్ ప్రదేశ్లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్లో కనిపించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడింది. 2020లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి వివాహం ఆలస్యమైంది. సుమారు మూడు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టింది. విక్రాంత్ ప్రస్తుతం ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రూబా , ముంబైకర్ , సెక్టార్ 36, యార్ జిగ్రీ వంటి ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) -
ఆ ఒక్క సినిమాతో ప్రతిష్టాత్మక అవార్డ్ కొట్టేసిన నటుడు!
చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్తోనే బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ కావాలనే కలను నిజం చేసుకున్న నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఐపీఎస్ కల కోసం మనోజ్ కుమార్ శర్మ కష్టపడిన తీరును చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలో అతని నటనకుగానూ ప్రతిష్టాత్మక అవార్డ్కు ఎంపికయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ను(ఉత్తమ నటుడు) అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్లో ఈ అవార్డ్ను బహుకరించారు. కాగా.. ధరమ్ వీర్, బాలికా వధు, బాబా ఐసో వర్ ధూండో, యే హై ఆషికి వంటి కొన్ని సీరియల్స్లో విక్రాంత్ మాస్సే నటించారు. అంతే కాకుండా ఎ డెత్ ఇన్ ది గంజ్, ఛపాక్, హసీన్ దిల్రూబా, గ్యాస్లైట్ వంటి చిత్రాలలో కనిపించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. కాగా.. ప్రస్తుతం 12th ఫెయిల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
OTT: సడన్గా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ సినిమా
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్లో డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఇప్పటికే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులో చూద్దాం అనుకున్న ప్రేక్షకుల్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. డిస్నీ + హాట్ స్టార్లో నేటి నుంచి ‘12th ఫెయిల్’ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. సినిమా విషయానికొస్తే.. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇది రికార్డ్కెక్కింది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతోమంది ఈ సినిమాను చూద్దామనుకున్నారు కానీ హిందీ వర్షన్లో ఉండటంతో వీలు కాలేదు.. ఇప్పుడు తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడ వంటి ప్రాంతీయ భాషలలో డిస్నీ + హాట్ స్టార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సినీ ప్రేక్షకులు ఎంతగానో సంతోషిస్తున్నారు. -
క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్
'12th ఫెయిల్' హీరో క్షమాపణ చెప్పాడు. అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితం చేసిన ట్వీట్ని డిలీట్ చేయడంతో పాటు అప్పుడు జరిగిన విషయమై అసలేం జరిగిందో వివరణ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్.. అర్థరాత్రి చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు సారీ చెప్పాడు? హిందీ సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సే.. ఆ తర్వాత బుల్లితెర నుంచి సినిమా స్క్రీన్కి షిఫ్ట్ అయ్యాడు. కాకపోతే సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అదే టైంలో ఓటీటీలో 'మీర్జాపుర్' లాంటి వెబ్ సిరీస్తో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. గతేడాది చివర్లో '12th ఫెయిల్' మూవీతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) అయితే విక్రాంత్ 2018లో చేసిన ఓ ట్వీట్ని నెటిజన్లు బయటకు తీశారు. రాముడు-సీత కార్టున్తో ఉన్న ఈ ట్వీట్.. హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కొందరు విమర్శలు చేశారు. దీంతో సదరు ట్వీట్ని డిలీట్ చేసిన ఈ హీరో.. దీనికి ప్రతిగా క్షమాపణలు కూడా చెప్పాడు. '2018లో నేను కొన్ని ట్వీట్ చేశా. ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామనుకుంటున్నాను. హిందు కులాన్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. కానీ నేను చేసిన ట్వీట్ అలా అర్థం వచ్చేలా ఉండటం నాకు బాధ కలిగించింది. పేపర్లో వచ్చిన కార్టూన్నే నేను పోస్ట్ చేశాను. కానీ ఎవరైతే ఈ ట్వీట్ వల్ల బాధపడ్డారో వాళ్లందరికీ నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అందరూ తప్పులు చేస్తాను. ఇప్పుడు నేను చేశాను' అని విక్రాంత్ మస్సే తన ట్విట్టర్ (ఎక్స్)లో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) Deleted + Apology 🙏🔱🚩 pic.twitter.com/LkYOcaFxVp — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) February 20, 2024 In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words: It was never my intention to hurt, malign or disrespect the Hindu community. But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could… — Vikrant Massey (@VikrantMassey) February 20, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019