breaking news
-
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
వేసవి ఉష్ణోగ్రత పెరగనుంది.. జర జాగ్రత్త! : వాతావరణశాఖ హెచ్చరిక
ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా.. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎండ తీవ్రత ఇలా.. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా.. మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మూడో వారానికి 40 డిగ్రీలు దాటగా, ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. ఏప్రిల్ 7న కొన్ని చోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆతర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈనెల రెండో వారం నుంచి సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి చదవండి: వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్! -
నెల ముందే.. నిప్పులు చెరిగే సూరీడుతో.. జర జాగ్రత్త!
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్గా నిపుణులు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా. ఎండ ప్రభావం.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు? -
Summer Season: డీ హైడ్రేషన్తో ఇబ్బందా? నివారించండి ఇలా..
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్ని నివారించేందుకు ఈ చిట్కాలు. డీ హైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం. డీ హైడ్రేషన్ను ఎలా గుర్తించాలంటే..? నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్ ను సూచించే మరొక గుర్తు. కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. డీహైడ్రేషన్ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్ సూచించే ఒక గుర్తు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం. ఇవి చదవండి: ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే -
ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త!
మొన్నమొన్నటి దాకా చల్లగా సాగిన ప్రయాణం ఇప్పుడు వేసవి కొలిమికి సిద్ధమైంది. సమ్మర్ వార్తలు కొంతకాలంగా డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మొదలైన మార్పులు, మరోవైపు నిపుణుల హెచ్చరికలు తెలియకుండానే గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక నుంచి ఏం తిన్నా, ఏం తాగినా ఆపసోపాలే! ఎటు వెళ్లినా, ఎక్కడాగినా నీరసాలు, నిట్టూర్పులే! మరి ఈ ఎండాకాలాన్ని ఎలా దాటెయ్యాలి? ఈ వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్లు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణసమస్యలు ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతర కాలాల్లో అనారోగ్యం వస్తే.. ఏదో ఒకటి తిని, ఓ టాబ్లెట్ వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రైనాపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో నిద్ర కూడా పట్టదు. పరచుకున్న పరుపులోంచి, మూసి ఉన్న తలుపుల్లోంచి వేడి తన్నుకొచ్చి.. కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వడగాల్పులను తట్టుకోవాలంటే.. చలువ చేసే ఆహారాలు, చల్లబరచే పానీయాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తినేవాటిలో ఆయిల్ లెస్, తాగేవాటిలో సుగర్ లెస్ తప్పదంటున్నారు. జంక్ ఫుడ్కి, సాఫ్ట్ డ్రింక్స్కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపించదు. ఆరారగా పానీయాలు తాగాలనిపిస్తుంది. అసలు తినడానికైనా, తాగడానికైనా ఏవేవి మంచివో చూద్దాం. ఎండాకాలం ఆహారాలు దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, అనాసకాయ ఇలా ప్రతి పండూ వేసవిలో ఆస్వాదించతగ్గదే! వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే అరుగుదల సజావుగా చేసి.. జీర్ణకోశాన్ని తేలికపరుస్తాయి. ఆయా పండ్లతో చిక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు. భోజనం విషయానికి వస్తే ఆకుకూరలు, కూరగాయలకే పోపు పెట్టడం మంచిది. సమ్మర్లో మాంసం, చేపలు వంటివి తినడం వల్ల అరుగుదల ఆలస్యం అవుతుంది. కడుపు బరువుగా మారుతుంది. నాన్వెజ్ వంటకాల్లో నూనె, మసాలా వంటివి ఎక్కువగా వాడాల్సి రావడంతో అవన్నీ వేసవి కాలంలో జీర్ణక్రియ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తినేటప్పుడు తేలికగా అరిగేవి ఎంచుకోవాలి. వేపుళ్లు తినడం వల్ల వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీరు, జావలు, జ్యూసులు, ద్రవాహారాలను తీసుకోవాలి. డబ్ల్యూఎంఓ హెచ్చరిక ఈ వేసవి మూడునెలలు మండుతున్న కుంపటే అని మన వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్నే ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా వెల్లడించింది. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. గత ఏడాది జూన్లో ‘ఎల్ నినో’ ఏర్పడిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వెల్లడించింది. ఇవి అస్సలు తినొద్దు... కెఫీన్, ఆల్కహాల్: ఈ రెండూ బాడీని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అందుకే వేసవిలో కాఫీ, టీలతో పాటు మద్యానికీ దూరంగా ఉండటం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ చెమటలు పుట్టిస్తాయి. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఉక్కబోతల వాతావరణంలో మరింత వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు బాడీని ఎక్కువగా డీహైడ్రేషన్కి గురిచేస్తాయి. ఇలాంటివి తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని వల్ల నీరసంగా, అలసటగా ఉంటుంది. అరుగుదల లోపంతో తెలియకుండానే ఆపసోపాలు మొదలవుతాయి. వేసవి పానీయాలు సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ‘ఉత్త నీళ్లు ఎన్నని తాగుతాం‘ అనుకునేవారు ’ఇలా చిటికెలో అయ్యే చలవ పానీయాలను తయారుచేసుకుని తాగండి’ అంటున్నారు నిపుణులు. అయితే పంచదారకు బదులుగా తేనె వాడుకోవడం మంచిది. తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు. సబ్జా నీళ్లు.. ఈ సమ్మర్ సీజన్ లో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. అందుకే నీళ్లలో సబ్జా వేసుకుని తాగడం మంచిది. తేనె– నిమ్మరసం నీళ్లు ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండుకుని, ఒకటిన్నర లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగొచ్చు. ఇది తక్షణశక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. సోంపు నీళ్లు సోంపులో ఈస్ట్రాగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచి, జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది. కొబ్బరి బోండం.. కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉండే ఈ సహజపానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది. జీలకర్ర నీళ్లు.. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. సమ్మర్లో రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఏలకుల నీళ్లు ఏలకుల్లోని ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లల్లో ఏలకుల్ని దంచి వేసుకుని, బాగా కలుపుకుని, వడకట్టి తాగాలి. అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ నీళ్లు శరీరంలో వేడిని వేగంగా తగ్గిస్తాయి. మెంతుల నీళ్లు మెంతుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్ , పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లల్లో నానబెట్టి, వడకట్టుకుని తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి, చల్లబడుతుంది. దనియాల నీళ్లు ఒక టీస్పూన్ దనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి, చల్లార్చుకుని తాగితే మంచిది. దనియాల్లోని పైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్.. బాడీలోని టాక్సిన్స్ను తొలగించి.. చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ.. వేసవికి అసలు సిసలు చల్లదనం మజ్జిగతోనే వస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని, గిలక్కొట్టి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయట పడొచ్చు. అలాగే ఫ్రిజ్లో వాటర్ కంటే మట్టికుండను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. చర్మసంరక్షణ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది. మొటిమలు రావడం, ముఖం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం, సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ముఖాన్ని నీళ్లతో కొట్టినట్లుగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు అయినా నేచురల్ స్క్రబ్తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది. క్రీమ్స్ అండ్ లోషన్స్ సాధారణంగా మాయిశ్చరైజర్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు. చర్మసంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడితే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరచిపోవద్దు. అది సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంలోని తేమను కాపాడుతుంది. హెయిర్ కేర్ ఎవరికైనా కురులే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ వేసవి వచ్చేసరికి చెమటకు, ఉక్కపోతలకు ఆ కురులే విసుగుపుట్టిస్తుంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వేసవిలోనూ జుట్టు ఆరోగాన్ని కాపాడుకోవచ్చు. పొడవాటి జుట్టున్నవారు పైకి ముడిపెట్టుకునేటప్పుడు జాగ్రత్తపడాలి. చిక్కులు పడకుండా అనువైన క్లిప్స్ వాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్లో కాని, బీచ్లో కాని తల తడిసినప్పుడు ఇంటికి వచ్చి మంచి నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారిపోయి బలహీనంగా,పెళుసుగా మారతాయి. కెమికల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత కురులను బలంగా రుద్దకూడదు. బాగా ఆరిన తర్వాతే జుట్టుని అల్లుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తల స్నానం తర్వాత వెంట్రుకలకు కండిషనర్ వాడటం మంచిది. గొడుగైనా.. హ్యాట్ అయినా.. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవడంతో బయటకి వెళ్లేప్పుడు తగుజాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే వేసవికి మరిన్ని జాగ్రత్తలు అసవరం అంటున్నారు నిపుణులు. వేసవిలో ప్రయాణాలు అంత మంచివి కావు. తప్పనిసరి అయితే మాత్రం వెంట తీసుకుని వెళ్లాల్సిన లిస్ట్ ఇదే. ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదా హెడ్ బ్యాండ్ మాస్క్.. ఇవన్నీ వెంట తీసుకుని వెళ్లాల్సినవే. మొత్తానికీ ఈ వేసవి చల్లగా ఉండాలంటే ‘లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ లిక్విడ్స్’ అనే పాలసీని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉంటే కుండలో నీళ్లనే తాగాలి. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టాలి. మన సంగతి సరే! పాపం మనతో పాటు జీవించే జంతువులు, పక్షులకూ ఈ వేసవి ప్రాణసంకటమే! కాస్త వాటి దాహాన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం. నాలుగు ధాన్యపు గింజలు ప్లేటులో వేసి, గోడ మీద పెడదాం. ఇవి చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019